7, మే 2013, మంగళవారం

జోహార్.... తారకరామా ...!

ఎలాగైతేనేం.... ఎట్టకేలకు పార్లమెంటులో రామారావు గారి విగ్రహం కొలువుతీరింది. అందరూ
హ్యాపీ.  ఒకళ్ళు పిలిచారని, మరొకళ్ళు పిలవలేదని రకరకాల వెర్షన్ల మధ్య రామారావు గారి
బొమ్మ దేశ అత్యున్నత చట్టసభా ప్రాంగణంలో నిలబడింది. చాలాకాలం తరువాత
తారకరాముడి కుటుంబం యావత్తునూ కళ్ళారా చూసాం. ఆనందం కలిగింది. ఫ్యామిలీ
ఫోటో లో చంద్రబాబు లేకపోవటం కొంచెం వెలితిగా అనిపించింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన క్రెడిట్
తమదంటే తమదని అటు పురంధరేశ్వరి పోటిపడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ
చేసిన కృషి అందరికీ తెలిసేలా జరిగింది. బాలయోగి గారి టైం నుంచి ఈ ప్రయత్నం
జరుగుతోంది. పురంధరేశ్వరి గారు నిశ్సబ్దంగా ప్రయత్నించారేమో తెలియదు.ఏదిఏమయినా
పని పూర్తయింది. లక్ష్మీపార్వతి గారు కూడా డిల్లీ వెళ్లి అందరితో కలివిడిగా తిరిగారుట.
దాదాపు అందరికి తాను రామారావు గారి సతీమణిని అని పరిచయం చేసుకున్నారట.
అదీ బానే వుంది.ఎక్కడో కృష్ణా జిల్లా నిమ్మకూరు లో పుట్టి నటుడిగా అంతర్జాతీయస్థాయికి
ఎదిగి రాజకీయాల్లోకి ఎంటరైన 9 నెలలకే ముఖ్యమంత్రి పదవినధిష్టించిన మహిమాన్వితుడు
తారకరాముడు. పార్లమెంటులో ఆయన విగ్రహం కొలువుతీరటం తెలుగు వారందరికీ
గర్వకారణం. ఇది మాత్రమే చాలదు. దేశ అత్యున్నత పురస్కారమయిన ' భారతరత్న '
పురస్కారం ఆయనకు ప్రకటించేలా రామారావు కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పురంధరేశ్వరి
కృషి చేయాలి. అప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది.   

1 కామెంట్‌: