3, మే 2013, శుక్రవారం

ఇంతటి పైశాచికమా ?


  సరబ్ జిత్ మృతి బాధ కలిగించింది. ఏదో ఒకటి జరిగి అతడు బతికితే బావుణ్ణు అని అందరూ
  అనుకుంటూండగానే  సరబ్ కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు గుండెలు పగిలేట్టు విలపించారు.
  దేశం యావత్తూ కోరుకుంది. అయినా ఫలితం లేకపోయింది. పాకిస్తాన్ మూర్ఖత్వం, మొండితనం,
  రాక్షత్వం సాక్షిగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒక ప్రాణాన్నే లెక్క చేయని ఆ దేశం ఆ ప్రాణాన్నీ
  కాపాడటం కోసం చిత్తశుద్ధి తో ప్రయత్నం చేస్తుందనుకోవటం అమాయకత్వం, అవివేకం కూడా.
  ఆ నిర్లక్ష్యమే సరబ్ ప్రాణాలు బలిగొంది. తోటి ఖైదీల దాడిలో గాయపడ్డ అతడిని వెంటనే భారత్
  తరలించి వుంటే బతికేవాడేమో. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
  ప్రభుత్వం మరింత తీవ్రంగా ప్రయత్నం చేసి వుంటే సరబ్ భారత్ కు వచ్చేవాడేమో....
  బతికేవాడేమో....మృతదేహం భారత్ కు వచ్చినతరువాత సోనియా గాంధి, రాహుల్ గాంధి లు
  ఎంతమంది పరామర్సించినా ఫలితం ఏముంటుంది.... ప్రాణం గాలిలో కలిసిపోయింది.... పైగా
  పాశవికం ఏమిటంటే సరబ్ మృతదేహాన్ని ఇండియా కు పంపుతూ అతడి గుండె, కిడ్నీ లాంటివి
  తీసేసి పంపారట. పాకిస్తాన్ ది ఎంతటి పాశవికం. ఎంతటి రాక్షసత్వం. అసలు మనుషులేనా ?
  మానవత్వమనేది లేదా..... ఈ పాపానికి కారకులెవరు ? ఈ ఘాతుకానికి కారణమెవరు ?
  గుండెలవిసి పోయేట్టు అల్లాడిపోతున్న సరబ్ కుటుంబ సభ్యులను ఓదార్చేదెవరు?




   ఇంతటి పైశాచికమా ?
  

1 కామెంట్‌:

  1. Bharath desam mottam kooda GHAJINI cinemalo surya la brathukutunaru....monnaki monna sainikulani oochakotha kosaru....prabhutvam nirasana teliya jesindi...Dilshuknagar bomb pellulu jarigayi...pradhana mantri visit chesaru.....ipudu sarabjith singh udantam.......anthyakriyalaki prabhutva peddalu hajaraiyaru....
    inka veelaithe Cricket aadatam manestaru anthaku minchi jarugutundanna aasa ledu...

    రిప్లయితొలగించండి